ADVERTISEMENT
ADVERTISEMENT
ఈ ఏడాది రైతుబంధు పథకం కింద 56.76 లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు 39.72 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.
మిగిలిన రైతులకు చెల్లింపులు ప్రాసెస్లో ఉన్నాయన్నారు. గతేడాది రైతుబంధు పథకం కింద రూ.10,505 కోట్లు చెల్లించాం. ఎకరానికి పంటకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు రూ. 10 వేలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు.