యాంకర్, టీవీ షో హోస్టుగా పేరొందిన లాస్యా మంజునాథ్ అంటే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే.. 2012లో యాంకర్ రవితో కలిసి ‘Something Special’ షోతో పాపులర్ అయింది. ఈ షోతో యువ ప్రేక్షకులలో మరింత ఆదరణ సంపాదించుకున్నారు యాంకర్ లాస్య.. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఆడియెన్స్ను ఆకర్షించింది.
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జన్మించిన లాస్యా హైదరాబాద్లోని ప్రముఖ చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ చేసింది. సమ్థింగ్ స్పెషల్ టీవీ షో తరువాత ఆమె 2014లో ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’, 2016లో మా ఓరి వంట, 2017లో ‘ఢీ అల్టిమేట్ డాన్స్ షో’ వంటి పలు రకాల టీవీ షోలతో ఆకట్టుకుంది. యాంకర్గా తనకు ఎన్నో అవార్డులు
లభించాయి. 2014లో బెస్ట్ ఫిమేల్ వీడియో జాకీ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.
లాస్యా తాను ప్రేమించిన మంజునాథ్ను 2017లో వివాహం చేసుకుంది. అదే సంవత్సరంలో ‘Raja Meru Keka’ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది. 2018లో వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ మూవీ ‘ఎమ్మెల్యే’మూవీలో సోదరిగా లాస్యా నటించింది. ఆ తర్వాత టీవీ, మూవీలకు బ్రేక్ ఇచ్చారు.
గత బిగ్ బాస్ సీజన్ 3లో లాస్యా మంజునాథ్ పాల్గొంటొందనే వార్తలను అప్పట్లో లాస్యా ఖండించింది. కానీ, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4తో మళ్లీ టెలివిజన్ షోలోకి వస్తున్నారు.. బిగ్ బాస్ టీవీ షోలో కూడా ఎప్పటిలాగే తనదైన శైలిలో ఎలా అభిమానులను అలరిస్తారో చూడాలి..