సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ కన్నుమూశారు. గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మల్లేశ్ మృతి పట్ల సీపీఐ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ నేతలు డి.రాజా, నారాయణ.. రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్రెడ్డితో పాటు అజీజ్పాషా తదితరులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. పార్టీకి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మల్లేశ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గుండా మల్లేశ్ భౌతిక కాయాన్ని కాసేపట్లో సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్కు తరలించనున్నారు. అక్కడ వామపక్ష పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు ఆయనకు నివాళులర్పించనున్నారు. అనంతరం మల్లేశ్ పార్థివ దేహాన్ని బెల్లంపల్లి తరలించనున్నారు.