ఈ రోజు మధ్యాహ్నం GHMC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడమతొ రాజకీయ పార్టీలన్నీ గరం గరం ఉన్నాయి. ఎన్నికల కమీషన్ కూడా ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని, దానికోసం 45 వేల సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు నోడల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్.
ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 25 లోగా ఓటర్లకు ఓటరు స్లిప్ల పంపిణీ పూర్తి చేస్తామని అన్నారు. మైక్రో అబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్ వాలంటీర్ల నియామకం వెంటనే చేపట్టాలని నోడల్ ఆఫీసర్లకు సూచించారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని.. రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రదేశాల్లో రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని లోకేష్ కుమార్ అన్నారు. ఫిర్యాదులు, విజ్ఞాపనల స్వీకరణకు జీహెచ్ఎంసీ ఆఫీస్తో పాటు అన్ని జోనల్, డిప్యూటి కమిషనర్ కార్యాలయాలలో ఎన్నికల కాల్ సెంటర్ల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి చేయాలని ఆదేశించారు.