కథానాయకుడు గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో రూపొందుతోన్న కొత్త చిత్రం ‘సీటీమార్’. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఉగాది కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గోపీచంద్ సరసన హీరోయిన్గా తమన్నా నటిస్తున్నారు. ఇప్పటికే వేసవి సినిమాల లిస్ట్ పెద్దగానే ఉండగా, తాజాగా గోపీచంద్ ‘సీటీమార్’ తో వచ్చి చేరాడు.
