టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు, నమత్ర శిరోద్కర్ల గారాల పట్టి సితార ఇప్పుడు ఓ 3డీ యానిమేషన్ వెబ్సిరీస్ ఫంటాస్టిక్ తారకు బ్రాండ్ అంబాసిడర్గా మారింది. ఈ వెబ్సిరీస్ పోస్టర్ను బుధవారం రాత్రి మాదాపూర్లోని ఓ హోటల్లో నమ్రతా శిరోద్కర్, బాలీవుడ్ నటి నేహా ధూపియా, తెలంగాణా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరుల సమక్షంలో విడుదల చేశారు. బ్రాండ్ అంబాసిడర్గా మారడం పట్ల చాలా ఆనందంగా ఉందని సితార చెబుతూ తన స్నేహితురాలు తార తనతో పాటుగా ఎదగనుందని చెప్పింది. ఈ సిరీస్ మొదటి సీజన్ ఏప్రిల్లో విడుదల చేయనున్నామని నిర్మాతలు నయన్, మనీష్, డైరెక్టర్ రాజేంద్ర తెలిపారు.
