ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. నిఘా పరికరాల కొనుగోళ్ల అక్రమాల వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్పై హైకోర్టు గతంలో స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం విదితమే.
కాగా డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్కు గురైన ఏబీని సస్పెండ్ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్లో(క్యాట్) ఇదివరకే స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను క్యాట్ కొట్టివేసింది. అనంతరం సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగా.. దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ క్రమంలో గురువారం అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.