సీఎం కేసీఆర్.
- కిరికిరి గాళ్ళకు పంచాయతీ లు పెట్టకుండా ధరణి పోర్టల్ ను రూపొందించాము.
- కుటుంబ పెద్ద చనిపోతే వారి ఆస్తిని ఎవరికి రాయాలి అనేది కుటుంబ సభ్యులకు అధికారం ఇచ్చాము.
- రిజిస్ట్రేషన్ లు ఆగవు తహశీల్దార్ లేకపోతే డిప్యూటీ తహశీల్దార్ లు రిజిస్ట్రేషన్ లు చేస్తారు.
- ధరణి పోర్టల్ ప్రభావం పక్క రాష్ట్రాల పై కూడా పడుతుంది…పడింది చాలా రాష్ట్రాల వారు నాకు ఫోన్ లు చేస్తున్నారు పోర్టల్ బాగుంది అని కితాబు ఇస్తున్నారు.
*రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా పనులు చేస్తుంది.అందరూ చెడ్డ వాళ్ళు కారు.
- రెవెన్యూ సంస్కరణలు చేసింది సాలర్జంగ్…అప్పుడు జరిగిన భూ సంస్కరణలు మళ్ళీ ఇప్పటి వరకు భూ సర్వే జరగలేదు.
- పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ భూ సంస్కరణలు చేశారు.ఐటీ మేమే తెచ్చాము అని చెప్పుకునే ముఖ్యమంత్రులు రెవెన్యూ లో ఐటీ ని తీసుకు రాలేదు.
- తెలంగాణ ప్రభుత్వం ఐటీ ని తీసుకు వచ్చింది.
- రాష్ట్రం మొత్తం ఇంచు కూడా వదలకుండా భూ సర్వే చేస్తాము.అందరికి హద్దులు ఏర్పాటు చేస్తాము.
- కాళేశ్వరం ద్వారా చాలా చెరువులు నిండినయ్.వర్షాలు పడి చెరువులు పడ్డాయి.
నీళ్లు ఎక్కువ ఉండడం తో నేను నా పంట ను కూడా కోయలేకపోయాను.
*మేడ్చల్ లో కూరగాయలు పండించాడడానికి హర్టీ కల్చర్ లు ఆఫీసర్ లలను కూడా నియమిస్తాము.. - కరోనా వచ్చి రాష్ట్ర ఆదాయం పడిపోయింది. కేంద్రం ఇచ్చే gst నిధులు కూడా ఇవ్వడం లేదు అయిన ప్రభుత్వ పథకాలు ఆపడం లేదు.
కేసీఆర్ బ్రతికి ఉన్నన్ని రోజులు రైతు బంధు వస్తుంది. - రైతుల అకౌంట్ లో పైసలు నిల్వ ఉన్నప్పుడే నిజమైన బంగారు తెలంగాణ.
*సాదా బైనామాలకు ప్రభుత్వం చిట్ట చివరి అవకాశం ఇచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోండి. - దాదాపు లక్ష 64 వేల సాదా బై నామాలు వచ్చాయి. ఇంకో వారం రోజుల పాటు సాదా బై నామాల డేట్ పెంచుతున్నాము.
- పోడు భూములు, అటవీ, వక్ఫ్ భూములు
- పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తాం.
- vro లను త్వరలో ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ చేస్తాము.
- 95 శాతం కు పైగా రైతు వేదికలు పూర్తి అయ్యాయి.
- రైతుల ఆత్మహత్యలు చూసి నేను ఏడ్చాను. రైతులకు ఎలాంటి బాధలు లేకుండా చేస్తాను.