తెలంగాణ మహిళా కమీషన్ చైర్పర్సన్గా సునీతా లక్ష్మా రెడ్డి
తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. చైర్పర్సన్తోపాటు మరో ఆరుగురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. చైర్పర్సన్, సభ్యుల పదవీకాలం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఐదేండ్ల వరకు ఉంటుంది.